
నివాసాల వద్దకు కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కొండాపురం సిఎంఆర్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ ఇంటి వద్ద కొండచిలువ కోడిపుంజును మింగుతుండగా స్థానికులు గమనించి దాడి చేశారు. దీంతో కొండచిలువ కోడిపుంజును వదిలిపెట్టింది. ఆ తర్వాత స్థానికులు కొండచిలువను కొట్టి చంపారు. గంటికోట జలాశయం వెనుక జలాల నుంచి కొండచిలువ వచ్చినట్లు స్థానికులు తెలిపారు.




