
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి వున్నారు. మంగళవారం శ్రీవారిని 63,239 మంది భక్తులు దర్శించుకోగా 23,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లుగా ఉందని టిటిడి అదికారులు వెల్లడించారు.




