ఉరవకొండ: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ప్యాపిలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దసరా పండగ వేళ జరిగిన ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఉరవకొండ పాతపేటకు చెందిన సుంకన్న(40), భార్య కల్పన, కుమారుడు సన్నీ, కుమార్తె భవాని ద్విచక్ర వాహనంపై వజ్రకరూరు మండలం కడమలకుంటలో సుంకలమ్మ ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్యాపిలి వద్ద గుర్తు తెలియని వాహనం.. వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుంకన్న, సన్ని(8) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కల్పన, భవానీని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. పండగపూట చోటు చేసుకున్న ఈ ఘటన బాధత కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది.