
మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : మెజారిటీ సీట్లను సాధించిన బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కకుండా సీఎం రే వంత్ రెడి, మం త్రులు,బీఆర్ఎస్,ఎంఐఎంతో కలిసి మీరు చేయని కుట్రలకు,సీఎం మొదలు పెట్టిన ఆటకు ముగింపు ఇస్తాన ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంత రం మీడియాతో మాట్లాడుతూ మీరు అనవసరంగా, అప్రజా స్వా మికంగా నన్ను కెలికి ఆటమొ దలుపెట్టారన్నారు. ఇక మీ ఆటకు నేను ముగింపు ఇస్తా అని సీఎం రేవం త్ రెడ్డికి అల్టి మేటం ఇచ్చారు. క్రికెట్లో ఇండియాపై పాకిస్తాన్ ఘనవిజయం సాధించినట్లుగానే, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కబడ్డీ ఆటలో…మీ అందరినీ ఓడించి బీ జేపీ కప్ గెలుచుకుందని పేర్కొన్నా రు.కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటి కావ డానికి కారణమేంటి? ప్రజాస్యామ్యాన్ని అపహా స్యం చేసేలా ఫాంహౌజ్ వేదికగా కుట్రలు ఎందుకు చేశారు?
ఎవరిపై మీ కోపం? కాంగ్రెస్ గెలిచింది 14 సీట్లు, ఎంఐఎం గెలిచింది 3 సీట్లు, బీఆర్ఎస్ గెలిచింది 9 సీట్లు… అన్నీ కలుపుకున్నా 26 సీట్లు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ దాటనే లేదన్నారు. ఇవన్నీ తెలిసి ఎందుకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, కాంగ్రెస్, బీఆర్ ఎస్, మజ్లిస్ పార్టీలన్నీ కలిసి రెండు రోజులుగా జరుగుతున్న కుట్రలను చూసి ప్రజలే విస్తుపోయారన్నారు. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటున్నారా? అంటూ సోషల్ మీ డియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.ఎన్నిక ఈ విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల పంథాను చూసి అభినందించకుండా ఉండలే కపోతు న్నానన్నారు. ప్రజాస్వామ్య తీర్పును శిరసావహించాలనే ఉద్దేశంతో పార్టీ నిర్ణ యానికి భిన్నంగా వ్యవహరించిన తీరు గొప్ప విషయమన్నారు.




