
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరుకే దిగుతుంది. మొత్తం 294 స్థానాలకు అభ్యర్థులను దింపుతుంది. పశ్చిమ బెంగాల్ పిసిసి కీలక నేతలతో సంప్రదింపుల సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి రాహుల్, కేసి వేణుగోపాల్, బెంగాల్కు పార్టీ ఇన్చార్జీ గు లాం అహ్మద్ మీర్ , బెంగాల్ పిసిసి అధ్యక్షులు శుభాకంర్ సర్కార్ , ఎంపి ఇషా ఖాన్ చౌదరి ఇతర నేతలు హాజరయ్యారు. తరువాత మీర్ వి లేకరులతో మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏ్ర పిల్ లేదా మే నెలల్లో ఎప్పుడైనా జరగవచ్చు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో బిజెపి తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి యత్నిస్తోంది. తమకు ఇంతకాలం ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు వామపక్షాలు తమ జెండా ఎగురవేసుకునే దిశలో కలిసికట్టుగా ప్రయత్నించలేకపోతున్నాయి.




