
న్యూఢిల్లీ : ఈసారి గణతంత్ర దినోత్సవంలో తొలిసారిగా అగ్నివీర్ మహిళా దళం ద్వారా వాయుసేన బాండ్ పాల్గొంటుంది. ఇందులో తొమ్మండుగురు మహిళా అగ్నివీరులు పాలుపంచుకుంటారు. ఈ మహిళా బృందం వాయిద్యాలు ఆలాపిస్తూ కర్తవ్యపథ్లో ముందుకు సాగుతారు. తరువాత జరిగే సైనిక , ఇతరత్రా ప్రదర్శనలకు ఆరంభం పలుకుతారు. ఐఎఎప్ బాండ్కు సెర్జెంట్ ఛార్లెస్ ఆంటోని డేనియల్ నాయకత్వం వహిస్తారు. 144 మందితో కూడిన కవాతు బృందం వాయుసేన తరఫున పాల్గొంటుంది. గణతంత్రం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంబడి నిలిచి జాతీయ పతాకాన్ని ఫ్లెయిట్ లెఫ్టినెంట్ అక్షిత ధన్కర్ ఎగురవేస్తారని వాయుసేన తెలిపింది.




