
ప్రయాగ్రాజ్ : శనివారం పౌష్యపౌర్ణమి సందర్భంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో ఉదయం 10 గంటల్లో 9 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. ఈ నెలంతా కల్పవాస్ జరుగుతుంది. ఈ సందర్భంగా స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ప్రతిరోజూ రెండు సార్లు గంగలో మునిగి స్నానాలు చేస్తుండటం సంప్రదాయంగా వస్తోంది. త్రివేణి సంగమం ఆరతి సేవ సమితి అధ్యక్షుడు ఆచార్య రాజేంద్ర మిశ్రా దాదాపు ఐదు లక్షల మంది స్నానాలతో ఈ మేఘమేలా ప్రారంభమైందని చెప్పారు.




