Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedబైక్ ను ఢీకొట్టిన రైలు .. ఐదుగురు మృతి

బైక్ ను ఢీకొట్టిన రైలు .. ఐదుగురు మృతి

పట్టాలు దాటుతున్న బైక్ ను రైలు ఢీకొట్టిన సంఘటనా ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో భార్యభర్తలు, వారి ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. వివరాలలోకి వెళితే.. పోలీసులు కథనం ప్రకారం.. షాజహాన్ పూర్ లోని రౌజా రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బైక్ పాదచారులు వేళ్లే మార్గంలో పట్టాలు దాటుతోంది. అదే సమయంలో లఖ్ నవూ నుంచి వస్తోన్న ప్యాసెంజర్ రైలు ఈ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఐదుగురు ఘటనాస్థలిలోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments