
మన తెలంగాణ/హైదరాబాద్: యూత్ కాం గ్రెస్ సభ్యులు తమ అ ల్ప రాజకీయ నాటకా ల కోసం ‘ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ను వేదికగా ఎంచుకోవడం అ త్యంత విచారకరం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఇలాంటి అం తర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముం దు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుందని ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ అసమ్మతిని వ్య క్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయని, ఎ ఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు కచ్చితంగా దానికి వేదిక కా దన్నారు. వారి సొంత పార్టీ సిఎం అదే ఎఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్బీసీ దుర్ఘటన అని కెటిఆర్ విమర్శించారు.




