
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై కారు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. బోయిన్ పల్లి ఎస్సై శివ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ..ఓల్డ్ బోయిన్ పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న రాపిడో కార్ నెంబర్ టీఎస్ 35 టి1337 గల కారులో హఠాత్తుగా బ్యాలెట్ నుంచి పోగలు రావడంతో అప్రమత్తమైనా చెంగిచెర్లకు చెందిన ప్రశాంత్ (27) తోపాటు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు వెంటనే క్రిందకి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా దగ్ధం కావడంతో సమాచారం అందుకున్న బోయినపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఎవరికి ఏమి కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.




