Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedఢిల్లీకి మళ్లీ నిరాశే.. రెండోసారి డబ్ల్యూపిఎల్‌ విజేతగా ఆర్సీబి

ఢిల్లీకి మళ్లీ నిరాశే.. రెండోసారి డబ్ల్యూపిఎల్‌ విజేతగా ఆర్సీబి

వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబి ఆరు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. కెప్టెన్ స్మృతి మంధాన (87), వోల్‌ (79)లు భారీ అర్ధ శతకాలతో రాణించారు. దీంతో ఆర్సీబి వరుసగా రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకుంది.

అంతకుముందు, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 203 పరుగుల చేసింది. ఓపెనర్లు లీ(37, 30 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు), షఫాలీ వర్మ(20, 13 బంతుల్లో మూడు ఫోర్లు)లతో రాణించగా.. కెప్టెన్ జెమీమా(57) అర్ధ శతకంతో అలరించింది. ఇక, చివర్లో వోల్వార్ట్(44, 25 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులు), హెన్రీ(35, 15 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు) ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగారు. దీంతో ఢిల్లీ, ఆర్సీబి జట్టుకు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments