Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedమేడారం జాతరలో బాలికపై అత్యాచారం..

మేడారం జాతరలో బాలికపై అత్యాచారం..

రాష్ట్రంలోని మేడారంలో ఇటీవల ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతరలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లూ) స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్లు కమిషన్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు ఈ గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయని వెల్లడించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్, విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీకి మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా ఖోంగ్‌దుప్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సభ్యురాలిగా ఉంటారు. ఫిబ్రవరి 5 నుంచి ఈ కమిటీ విచారణ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అవసరమైతే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఒక న్యాయవాది సహాయం కూడా తీసుకుంటారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, స్థానిక అధికారుల చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ కార్యక్రమం జనవరి 28 నుంచి 31 వరకు జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలంగాణ అధికారులు అప్పట్లో ప్రకటించడం గమనార్హం. మహిళలు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments