Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedవరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్‌తో కలిసి పాల్గొన్న మెగాస్టార్

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్‌తో కలిసి పాల్గొన్న మెగాస్టార్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు -2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయనను సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి మన శంకరవరప్రసాద్ గారు సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవితో పంచుకున్నారు. చిరంజీవి కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలోనే ఈ ఆహ్లాదకరమైన సమావేశం, అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం చోటుచేసుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments