
తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంకాంతి, నుమ పండులను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ చేరాలనేది తమ సంకల్పమని ఆయన మంగళవారం తెలిపారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవల రంగంలో రాష్ట్రం తిరుగులేని పురోగతి సాధిస్తుంనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్- విజన్ సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలని తెలిపారు. పతంగులు ఎగుర వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.




