
యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ ’ఓ.! సుకుమారి’ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. దామినిగా ఆమె స్పిరిటెడ్ అవతార్లో కనిపించింది, రంగురంగుల లంగా ఓణీలో… చేతుల్లో కర్రలు పట్టుకున్న గ్రామస్థుల నుంచి తప్పించుకుంటూ పరుగులు తీస్తూ, ఆమె హుషారైన పల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా కనిపించింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.




