
రామ్ పోతినేని హీరోగా పి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రంతో రామ్ ఒక స్టార్ హీరోకు అభిమాని పాత్రలో నటించారు.ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.. అయితే వీరిద్దరే డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రామ్ పోతినేని. వీరిద్దరూ పై వస్తున్న రూమర్స్ పై రామ్ స్పందించారు. ఈ సినిమా కోసం నేను ప్రమ గీతం రాశాను. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయని, మనసులో ఏమీ లేకపోతే అంత గొప్పగా పాట ఎలా రాయగలరని అందరూ అనుకున్నారన్నారు. కానీ ,నేను ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ ప్రాతలను ఊహించుకొని మాత్రమే లిరిక్స్ రాశానని, ఈ పాట రాసినప్పటికి అసలు హీరోయిన్ ఎంపిక జరగలేదన్నారు.




