
నైపర్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్ని కూడా కోల్పోయింది. ఇప్పటికే టి-20 సిరీస్ని చేజార్చుకున్న కరేబియన్లు తాజాగా నైపర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో ఓడి.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ని 0-2 తేడాతో చేజార్చుకున్నారు. ఈ మ్యాచ్ని వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 34 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ముఖ్యంగా వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్(109) కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించి సెంచరీ చేసినా.. ఫలితం మాత్రం కివీస్ను వరించింది. న్యూజిలండ్ జట్టులో ప్రతి ఒక్కరు అద్భతంగా రాణించారు. దీంతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ని 2-0 తేడాతో కైవసం చేసుకంది. జట్టు కోసం పోరాడిన షాయ్ హోప్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.




