
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రుత్విక్ అనే మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడు కేకలు వేయడంతో స్థానికుల కుక్కలను తరిమికొట్టారు. ఈ దాడిలో బాలుడి కన్నుకు గాయం కావడంతో షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కంటికి గాయం తీవ్రంగా ఉండడంతో సరోజినీ కంటి ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.




