
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక, సోమవారం స్వామివారిని 66,322 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,000 మంది భక్తులు వెంకన్నకు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.




