
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. చివరి పాట చిత్రీకరణతో సినిమా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో హైదరాబాద్లోని సెట్లో రామ్, భాగ్యశ్రీ బోర్సేపై దీనిని చిత్రీకరించారు. ఈ సందర్భంగా హీరో రామ్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ‘షూటింగ్ పూర్తయింది. నేను గర్వపడే సినిమా… మనమందరం గర్వపడే సినిమా..! నా కెరీర్లో ఈ అందమైన సినిమా ఇచ్చిన మహేష్కి ధన్యవాదాలు. నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా మీ ముందుకు వస్తోంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు సినిమా టీమ్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఫోకస్ చేస్తోంది. కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్స్టార్గా కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.’ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.




