Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedమున్సిపాలిటీలకు నజరానా

మున్సిపాలిటీలకు నజరానా

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూ రు చేసింది. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీ ల్లో రూ.2,780 కోట్లు మంజూరు చేస్తూ ఉ త్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్ అ ర్బన్ సిటీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ఈ నిధులు మం జూరు చే సింది. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2027’ లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రా ష్ట్రమంతటా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దాలని సిఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పట్టణాల్లో పె రుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన

అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారుల ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి కే ఉ న్న మున్సిపాలిటీల విస్తరణతో పాటు కొత్త గా ఏర్పడిన మున్సిపాలిటీల్లో మెరుగైన పౌర సదుపాయాలతో పాటు పెరుగుతున్న డి మాండ్‌ను అందుకునేలా అభివృద్ధి పను లు చేపట్టాలని లక్ష్యంగా ఎంచుకున్నారు.అందులో భాగంగా మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలోని 138 ము న్సిపాలిటీల్లో రూ. 2,780 కోట్ల ఖర్చుతో 2,432 పనులు చేపట్టేందుకు సిఎం ఆమో దం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలఫ్‌ంట్ ఫండ్ (యూఐడిఎఫ్) పథకాల నుంచి ఈ నిధులను మంజూరు చేసింది.

కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ. 20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 30 కోట్లు మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేయాలని మున్సిపల్ శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెర్వులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అన్ని మున్సిపాలిటీల్లో సంబంధిత విభాగాలు వెంటనే టెండర్లు పిలిచి ఈ పనులు ప్రారంభించాలని సిఎం సూచించడంతో పాటు 2026 మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని గడువుగా ముఖ్యమంత్రి నిర్ణయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments