Friday, October 10, 2025
Google search engine
HomeUncategorizedవాగు దాటే ప్రయత్నంలో భార్యాభర్తతో పాటు మరొకరు గల్లంతు

వాగు దాటే ప్రయత్నంలో భార్యాభర్తతో పాటు మరొకరు గల్లంతు

 జిల్లాలోని పోతిరెడ్డి రెడ్డి చెరువు వద్ద వాగును దాటే ప్రయత్నంలో క్రిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంబటాపురం గ్రామానికి చెందిన తనెం బాలయ్య, రాములమ్మ దంపతులిద్దరూ వాగులో కొట్టుకుపోయారు. వీరితో పాటు మరొకరు కూడా గల్లంతు అయినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, నవాబుపేట, హన్వాడ, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, భూత్‌పూర్ తదితర మండలాలతో పాటు అనేకచోట్ల భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములతో కూడిన వర్షపాతం నమోదైంది. నవాబుపేట మండలంలో భారీ వర్షానికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

రుద్రారం గ్రామంలో ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కొంతమంది రైతుల ఇళ్లలో దాన్యం, తిండిగింజలు సైతం వర్షార్పణం అయ్యాయి. స్థానిక. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ, వెంకటేశ్వర కాలనీ, మర్లు, వన్‌టౌన్, పెద్ద చెరువు ప్రాంతం బగీరథ కాలనీ,వీరన్నపేట తదితర కాలనీలో వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్లపై నీరు పెద్ద ఎత్తున చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.గత రెండు రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పాత ఇళ్లలో ఉన్న వారు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎక్కడైన ప్రమాదం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments