కొలంబో: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా భారత మహిళ జట్టు, పాకిస్థాన్ మహిళ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్కి దిగింది. ఈ క్రమంలో భారత బ్యాటర్లు పాక్ బౌలర్ల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. పాక్ బౌలర్లు భారత బ్యాటర్ల వికెట్లు తీస్తూ స్కోర్ని కట్టడి చేశారు. ముఖ్యంగా పాక్ బౌలర్ డయానా బైగ్ ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్లో హర్లిన్ డియోల్ 46, రిచా ఘోష్ 35, జెమిమా రోడ్రిక్స్ 32, ప్రతీక రావల్ 31 పరుగులు చేశారు. పాక్ బౌలింగ్లో డయానా 4, ఇక్బాల్, సనా చెరి రెండు, షమీమ్, నంధు తలో వికెట్ తీశారు.
ముగిసిన భారత్ బ్యాటింగ్.. పాకిస్థాన్ లక్ష్యం ఎంతంటే..
RELATED ARTICLES